Skip to main content

JanaSena PorataYatra at P.GannaVaram, East Godavari on 26th November, 2018

నిన్న P. GannaVaram లో పవన్ కళ్యాణ్ గారు speech మధ్యలో వున్నట్టుండి -

ఆడపిల్లలు క్షమించాలి...తెలుగులో ఒక ముతక సామెత వుంది - "వాడికి బయపడి, వీడికి బయపడి, వాడి అమ్మమొగుడికి బయపడి..."

ABN RK కు "మాదర్ చొ.." అన్న తిట్టు వాడుక పదమేమో, కానీ "వాడి అమ్మమొగుడు" అన్న పదము వున్న ఒక సామెతను ఉపయోగించటానికి ముందు "ఆడపిల్లలు క్షమించాలి" అని కోరిన పవన్ కళ్యాణ్ గారి సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేము.


నిన్నటి స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు మాట్లాడారు -


ఇసుక మాఫియాను టచ్ చేశారు, ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ గారి పేరు మీద ఏకముగా ఒక ఇసుక రాంపే నడపట్టాన్నిఛీత్కరించారు, అసెంబ్లీకి వెళ్లి ఇసుక మాఫియా గురించి అధికార పక్షాన్ని నిలదీయలేని ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలను ఎండగట్టారు. కాంట్రాక్టర్లనుండి వచ్చే కమిషన్స్కు కక్రుత్తి పడి అధికారపక్షం, ప్రతిపక్షం రెండు కుమ్మక్కై చేస్తున్న అవినీతి బాగోతాలని ఎత్తి చూపారు.


ఒక Incident జరిగితే కొన్ని రోజులు మీడియాలో చూపించి మర్చిపోయే ఈ రోజుల్లో, 2014 లో Nagaram village లో Gas Leakage వల్ల చనిపోయిన ప్రజలని గుర్తు చేసుకున్నారు, GAIL నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు.

కోనసీమనుంచి గ్యాస్ నిక్షేపాలను గుజరాత్ కు తరలిస్తున్న Reliance కంపెనీ మన రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది?

విద్యా సంస్థల్లో ఆడపిల్లలకు కనీస bathroom facilities లేవని బాధపడ్డారు.
మద్యపానం చేసి రోడ్లమీదకు వచ్చి ఆడపిల్లలని అల్లరి చేస్తే ఊరుకునేది లేదని Strong Warning ఇచ్చారు.

Watch Full Speech of Jana Sena Chief Sri Pawan Kalyan gaaru -



Comments

Post a Comment